ముస్లింలకు భరోసా ఇచ్చేందుకు ప్రత్యేక సదస్సు కేంద్రం తీసుకొచ్చిన పౌరచట్టం ముస్లింలకు అన్యాయం చేస్తుందని విపక్షాలు విమర్శిస్తోన్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. ఈ చట్టంపై ముస్లింలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు 'జాతీయ స్థాయి సదస్సు' పేరిట జనవరిలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తోంది.
ఈ సదస్సు నిర్వహణ గురించి చర్చించేందుకు భాజపా నేత, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నేతృత్వంలో దిల్లీలో పార్టీ ముస్లిం నేతలు భేటీ అయ్యారు.
"పౌరచట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తోన్న తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకే మేము 'జాతీయ స్థాయి సదస్సు'ను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం జనవరి మొదటి నెలలో ప్రారంభమవుతుంది. పౌర చట్టంపై ముస్లింలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి, దీనిపై విపక్షాలు ఏ విధంగా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయో వివరించబోతున్నాం."
-భాజపా నేతలు
ఈ కార్యక్రమానికి మైనారిటీల జాతీయ కమిషన్ చైర్మన్ గయోరుల్ హసన్ రిజ్వి, భాజపా మైనారిటీ మోర్చ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ, భాజపాకు చెందిన కీలకమైన ముస్లిం నాయకులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: మహారాష్ట్ర: రసాయన గోదాములో భారీ అగ్ని ప్రమాదం