తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2020, 12:37 PM IST

ETV Bharat / bharat

కమల్​నాథ్​ అనుచిత వ్యాఖ్యలపై దుమారం

మధ్యప్రదేశ్​ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా.. భాజపా మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. తమ అభ్యర్థిపై కమల్​నాథ్​ అనుచిత వ్యాఖ్యలు చేశారని భాజపా నేతలు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. కమల్​నాథ్​కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ రెండు గంటల పాటు దీక్ష చేపట్టారు. ద్రౌపదిని అగౌరపరచడం వల్ల మహాభారత యుద్ధం జరిగిందని... కమల్​నాథ్​ వ్యాఖ్యలను ప్రజలు సహించబోరని దుయ్యబట్టారు చౌహాన్​.

BJP leader requests Sonia Gandhi to dismiss Kamal Nath over his 'item' jibe
కమల్​నాథ్​ అణుచిత వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

మధ్యప్రదేశ్​ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్​ తరఫున ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమల్​నాథ్​.. భాజపా మహిళా అభ్యర్థి ఇమార్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం కుప్పకూలే సమయానికి ఇమార్తీ దేవి రాష్ట్ర కేబినెట్​ మంత్రిగా ఉన్నారు. అనంతరం భాజపా గూటికి చేరి తాజాగా ఉపఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దేవి కాంగ్రెస్​కు ద్రోహం చేశారని.. ఆమె వ్యవహారం తనకు ముందు తెలియదని పేర్కొన్నారు కమల్​నాథ్​. ఈ నేపథ్యంలోనే పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు​.

'అది నా తప్పా?'

కమల్​నాథ్​ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఇమార్తీ దేవి. ఆయన్ను పార్టీ నుంచి వెంటనే తొలగించాలని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీని డిమాండ్​ చేశారు.

"ఓ పేద ఎస్​సీ కుటుంబం నుంచి రావడం నేను చేసిన తప్పా? కమల్​నాథ్​ లాంటి వారిని కాంగ్రెస్​లో ఉండనీయరాదని నేను సోనియాను కోరుతున్నా. నా మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక ఎస్​సీ సంఘంలోని మహిళల పరిస్థితి ఏంటి? మహిళలు ముందడుగు ఎలా వేస్తారు?"

--- ఇమార్తీ దేవి, భాజపా నేత.

కమల్​నాథ్​ను ఇన్నేళ్లు సోదరుడిగా భావించానని... కానీ ఆయన తనను అగౌరపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు ఇమార్తీ దేవి. నిజానికి జ్యోతిరాదిత్య సింధియా వల్లే తాను కేబినెట్​ మంత్రి పదవి చేపట్టానని.. కమల్​నాథ్​ తనను చిన్నచూపు చూసేవారని ఆరోపించారు. కమల్​నాథ్​ వంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని భాజపాను కోరారు.

ఇదీ చూడండి:-ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు ఉద్యమించాలి: సోనియా

భాజపా ఆగ్రహం...

కమల్​నాథ్​ వ్యాఖ్యలపై భాజపా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర మహిళలను కమల్​నాథ్​ అగౌరపరుస్తున్నారని ఆరోపించింది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.

నిరసనలు...

భాజపా మౌన వ్రతం

కమల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. భాజపా నేతలు నిరసన బాటపట్టారు. మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్, ఇతర నేతలు రెండు గంటల పాటు 'మౌన వ్రతం' నిర్వహించారు. కాంగ్రెస్​కు దీర్ఘకాలం సేవ చేసిన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ద్రౌపదిని కించపరచడం వల్లే మహాభారత యుద్ధం జరిగిందని గుర్తుచేశారు.

శివరాజ్​ సింగ్​ చౌహాన్​

"కమల్​నాథ్​జీ... ద్రౌపదిని అగౌరపరచడం వల్ల మహాభారత యుద్ధాన్ని చూసిన దేశమిది. ఆ యుద్ధంలో ఓ కుటుంబం నాశనమయ్యింది. మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజలు సహించరు. ఇది సిగ్గుచేటు."

--- శివరాజ్​ సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి.

మరోవైపు ఇండోర్​లోని రీగల్​ స్క్వేర్​ వద్ద.. భాజపా రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, లోక్​సభ సభ్యుడు శంకర్​ లాల్వాని మౌన దీక్ష చేపట్టారు.

మధ్యప్రదేశ్​లో 28 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 3న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:-కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపిన ట్విట్టర్- నెటిజన్ల ఫైర్

ABOUT THE AUTHOR

...view details