ఫేస్బుక్ అంశంపై భాజపాపై తీవ్రంగా విరుచుకువడ్డ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ఇదే విషయంలో మోదీ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఫేస్బుక్ అధీనంలోని వాట్సాప్పై భాజపాకు పట్టు ఉందని ఆరోపించారు.
భాజపా-వాట్సాప్ మధ్య ఉన్న సంబంధాలను టైమ్ మ్యాగజైన్ బయటపెట్టిందని ట్వీట్ చేశారు రాహుల్. భారత్లో పేమెంట్ సర్వీసులు ప్రారంభించేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోందని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరమని పేర్కొన్నారు.
"భాజపా-వాట్సాప్ మధ్య ఉన్న బంధాన్ని అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ బయటపెట్టింది. 40 కోట్ల మంది భారతీయులు ఉపయోగిస్తున్న వాట్సాప్... మోదీ ప్రభుత్వ అనుమతితో పేమెంట్ సేవల కోసం ప్రయత్నిస్తోంది. ఈ విధంగా వాట్సాప్పై భాజపాకు పట్టు ఉంది."