తెలంగాణ

telangana

By

Published : Aug 9, 2019, 10:29 AM IST

ETV Bharat / bharat

మోదీ ప్రసంగం: భాజపా ప్రశంస- భరోసా ఇవ్వలేదన్న కాంగ్రెస్​

ఆపరేషన్​ కశ్మీర్​పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని భాజపా ప్రశంసించింది.  కానీ ప్రజలకు ఇది భరోసా, నమ్మకం ఇవ్వలేకపోయిందని విపక్ష కాంగ్రెస్ విమర్శించింది.

మోదీ ప్రసంగం: భాజపా ప్రశంస- భరోసా ఇవ్వలేదన్న కాంగ్రెస్​

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35ఏ రద్దు, రాష్ట్ర విభజనకు ప్రభుత్వ చర్యలపై గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగాన్ని భాజపా వర్గాలు ప్రశంసిస్తే... విపక్ష కాంగ్రెస్​ విమర్శలు చేసింది. కశ్మీర్​ ప్రజలకు భరోసా, నమ్మకం ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తింది.

కశ్మీరీల సంక్షేమమే లక్ష్యం: షా

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ ప్రజల అభివృద్ధి కోసం తన సంకల్పం, నిబద్ధతను ప్రధాని తెలియచెప్పారని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఆ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం, సంక్షేమం ప్రధాని మొదటి ప్రాధాన్యాంశాలని పేర్కొన్నారు. గడిచిన 70 ఏళ్లుగా కశ్మీరీలు అధికరణ 370తో అభివృద్ధికి దూరమయ్యారని తెలిపారు షా. దానికి ప్రధాని ముగింపు పలికారన్నారు.

అమిత్​ షా ట్వీట్​

చారిత్రకం: రవిశంకర్​

ప్రధాని ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ప్రధాని ప్రసంగం చారిత్రకమని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ ప్రాంతాలు రానున్న రోజుల్లో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేస్తూ... 'కశ్మీర్​ విత్​ మోదీ' హ్యాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేశారు.

రవిశంకర్​ ప్రసాద్​ ట్వీట్​

ప్రజలకు భరోసా ఇవ్వలేదు: కాంగ్రెస్​

హోంమంత్రి అమిత్​ షా చెప్పిందే ప్రధాని పునరుద్ఘాటించారు తప్ప కశ్మీరీ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు కాంగ్రెస్​ నేత ఆనంద్​ శర్మ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్.. కశ్మీర్​లో ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

వాక్చాతుర్యమే: సీపీఐ

ప్రధాని ప్రసంగంపై విమర్శలు చేశారు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా. ఆయన ప్రసంగం వాక్చాతుర్యమే తప్ప కొత్తదేమీ లేదన్నారు. ప్రధాని ప్రసంగం పూర్తిగా సాకులతో నిండి ఉందని విమర్శించారు.

ఇదీ చూడండి: కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు

ABOUT THE AUTHOR

...view details