తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుర్​దాస్​పుర్​ నుంచి లోక్​సభ బరిలో సన్నీ

భాజపాలోకి చేరిన కొద్ది గంటలకే బాలీవుడ్​ నటుడు సన్నీ దేఓల్​కు టికెట్​ కేటాయించింది పార్టీ. పంజాబ్​లోని గుర్​దాస్​పుర్​ భాజపా అభ్యర్థిగా సన్నీని ప్రకటించింది.

By

Published : Apr 24, 2019, 6:16 AM IST

గురుదాస్​పుర్​ నుంచి సన్నీ దేఓల్​

గుర్​దాస్​పుర్​ నుంచి సన్నీ పోటీ

లోక్​సభ ఎన్నికల్లో భాగంగా కమలదళం.. పంజాబ్​లోని 3 లోక్​సభ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. మంగళవారం రోజు భాజపా తీర్థం పుచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్​ నటుడు సన్నీదేఓల్​కు గుర్​దాస్​పుర్​ టికెట్​ కేటాయించింది.

దిల్లీలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్​, రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు సన్నీ దేఓల్​. అనంతరం కొంత సమయానికే పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది భాజపా.

చండీగఢ్​ నుంచి సిట్టింగ్​ ఎంపీ కిరణ్​ ఖేర్​కు మరోమారు అవకాశం కల్పించింది. హోశియార్​పుర్​ నుంచి సోమ్​ ప్రకాశ్​కు టికెట్​ కేటాయించింది.

తాజాగా ఈ ముగ్గురికి పార్టీ టికెట్​ ఇచ్చిన భాజపా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు 543 స్థానాలకు గాను 437 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించినట్లయింది.

2009 సార్వత్రికంలో 433, 2004లో 364, 1999లో 339 స్థానాల్లో భాజపా ఎన్నికల బరిలో నిలిచింది.

ఇదీ చూడండి:'వేలంలో ప్రధాని పదవిని కొనుగోలు చేయలేరు'

ABOUT THE AUTHOR

...view details