తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో భాజపా సీఈసీ భేటీ- ఎన్నికలపై కసరత్తు

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో సమావేశమైంది. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ నేతలు చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిష్ షా, జేపీ నడ్డా భేటీలో పాల్గొన్నారు.

By

Published : Sep 29, 2019, 11:39 PM IST

Updated : Oct 2, 2019, 1:04 PM IST

హరియాణా, 'మహా' అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు

దిల్లీలో భాజపా సీఈసీ భేటీ- ఎన్నికలపై కసరత్తు

మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు దిల్లీలో సమావేశమైంది భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ. ఈ భేటికి ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ హాజరయ్యారు.

మహారాష్ట్రలో శివసేనతో సీట్ల పంపకంపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన ఉండే అవకాశముందని పార్టీ నేత ఒకరు చెప్పారు. మహారాష్ట్రలో 288 సీట్లలో శివసేనకు 120-125 స్థానాల్లో పోటీ చేసే వీలుందన్నారు. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చినందుకు సమావేశంలో మోదీకి సన్మానం చేసినట్లు తెలిపారు.

మహారాష్ట్ర, హరియాణాలో అక్టోబరు 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: మహా పోరు: కాంగ్రెస్​ తొలి జాబితాలో అశోక్​ చవాన్​

Last Updated : Oct 2, 2019, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details