తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా.. ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోంది' - Kolkata Mayor Firhad Hakim

పశ్చిమ బంగాల్​లో ఘర్షణలు సృష్టించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి గూండాలను దింపుతూ.. భాజపా ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని తృణమూల్​ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది​. టీఎంసీ వ్యాఖ్యలను ఖండించింది భాజపా. బంగాల్​ను పాకిస్థాన్​లా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

'భాజపా ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోంది'

By

Published : Jun 24, 2019, 7:16 AM IST

తృణమూల్​ కాంగ్రెస్​, భాజపాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. పశ్చిమ బంగాల్​లో అల్లర్లు సృష్టించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి గుండాలను దింపుతూ.. భాజపా ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని ఆరోపించింది తృణమూల్​. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో మత ఘర్షణలు వ్యాప్తి చేస్తోందని దుయ్యబట్టింది.

" బంగాల్​లో భాజపా ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని లోక్​సభ ఎన్నికల నుంచి చెబుతున్నాం. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల నుంచి గుండాలను దింపుతున్నారు. భాట్​పాడాలో చెలరేగుతున్న అల్లర్లతో బంగాలీలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంది. మొత్తం రాష్ట్రాన్ని భాట్​పాడాగా మారటాన్ని మేము అనుమతించం."

- ఫిర్హాద్​ హకీమ్​, తృణమూల్​ సీనియర్​ నాయకుడు

ఖండించిన భాజపా..

తృణమూల్ కాంగ్రెస్​ ఆరోపణలను తిప్పికొట్టారు బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​. రాష్ట్రాన్ని పాకిస్థాన్​లా మార్చేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోందని ఎదురుదాడి చేశారు. భాట్​పాడాలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర పాలనా యంత్రాంగం ఏ మాత్రం సుముఖంగా లేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని ఆరోపించారు.

ఇదీ చూడండి:రాజస్థాన్​: గుడారాలు కూలి 15 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details