పశ్చిమ బెంగాల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం... రాష్ట్ర పరిపాలనలో కలుగజేసుకుంటోందని... భాజపా జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు. అధికారులు తాము చెప్పిందే వినాలని కిశోర్ బృందం ఒత్తిడి తెస్తోందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన విమర్శించారు.
అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్సీ), ప్రశాంత్ కిశోర్ సంస్థ, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పీఏసీ)... భాజపా ఆరోపణలను ఖండించాయి.
కిశోర్పైనే మమత ఆశలు
సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు చావుతప్పి కన్నులొట్టపోయింది. ఈ నేపథ్యంలో 2021 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్... ప్రశాంత్ కిశోర్ బృందం, 'ఐ-పీఏసీ'ని నియమించుకుంది.
ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు.. ప్రజల కోసం హెల్ప్లైన్, వెబ్సైట్లను మమతాబెనర్జీ ప్రభుత్వం ప్రారంభించింది. ఫలితంగా ప్రజలు నేరుగా తమ సమస్యలు, ఫిర్యాదులను ప్రభుత్వానికి తెలుపడానికి అవకాశం ఏర్పడింది.
ఇది సరికాదు
"మీడియా నివేదికల ప్రకారం... ప్రశాంత్ కిశోర్, అతని బృందం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నారు. ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకోనే నెపంతో అధికారులు ఏమి చేయాలి, ఏమి చేయకూడదో నిర్దేశిస్తున్నారు."