తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముత్తూట్​ ఫైనాన్స్​లో పట్టపగలే 55 కేజీల బంగారం దోపిడీ - బిహార్​లోని ముత్తూట్​ ఫైనాన్స్​ కార్యాలయంలో దోపిడీ

బిహార్ హాజీపుర్​లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ముత్తూట్​ ఫైనాన్స్​ కో బ్రాంచ్​ మేనేజర్​ను గన్​తో బెదిరించి సుమారు రూ.21 కోట్ల విలువైన 55 కేజీల బంగారాన్ని దోచుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముత్తూట్​ ఫైనాన్స్​లో పట్టపగలే 55 కేజీల బంగారం దోపిడీ

By

Published : Nov 23, 2019, 6:23 PM IST

Updated : Nov 23, 2019, 7:51 PM IST

ముత్తూట్​ ఫైనాన్స్​లో పట్టపగలే 55 కేజీల బంగారం దోపిడీ

బిహార్​ హాజీపుర్​లోని కొందరు దుండగులు సినీఫక్కీలో పట్టపగలే ముత్తూట్​ ఫైనాన్స్ కార్యాలయంలో దూరి బంగారాన్ని దోచుకున్నారు. 55 కేజీల ఈ బంగారం విలువ సుమారు రూ.21 కోట్ల విలువైన ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సినీ ఫక్కీలో..

ఎనిమిది మంది దుండగులు ఖాతాదారుల మాదిరిగా ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి వెళ్లారు. ఒక్కసారిగా తుపాకీలు తీసి కాపలాదారుని తలకు గురిపెట్టారు. ఈ హఠాత్తు పరిణామంలో అక్కడ ఉన్నవారంతా భయపడిపోయారు. మేనేజర్​ తలకు గన్​తో గురిపెట్టిన దుండగులు అందినంత బంగారం దోచుకెళ్లారు.

ముత్తూట్​ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదుచేశారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: 1978లో పవార్​ ఇలాగే చేశారు..!

Last Updated : Nov 23, 2019, 7:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details