తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2020, 11:39 PM IST

ETV Bharat / bharat

ఎన్నికల ప్రచారంలో కాల్పులు- అభ్యర్థి మృతి

బిహార్ ఎన్నికల ప్రచారంలో కలకలం రేగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో జనతా దళ్ రాష్ట్రవాదీ నేత శ్రీనారయణ్ సింగ్​ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కోపోద్రికులైన స్థానికులు ఓ నిందితుడిపై దాడి చేయగా.. అతడు మరణించాడు. హత్యకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Bihar: JDR candidate shot dead, one arrested
ఎన్నికల ప్రచారంలో కాల్పులు- అభ్యర్థి సహా ఇద్దరి మృతి

బిహార్​లోని శివహర్ జిల్లాలో జనతా దళ్ రాష్ట్రవాదీ పార్టీ అభ్యర్థి శ్రీనారాయణ్ సింగ్ హత్యకు గురయ్యారు. హథ్సర్ గ్రామంలో ఆయనను దుండగులు కాల్చి చంపారు. కాల్పుల్లో గాయపడ్డ సింగ్ అనుచరుడు సంజయ్ మరణించాడు. ఈ ఘటన పట్ల కోపోద్రికులైన స్థానికులు ఓ నిందితుడిపై దాడి చేసి ప్రాణాలు తీశారు. మృతి చెందిన నిందితుడిని జావెద్​గా గుర్తించారు.

శ్రీనారాయణ్ సింగ్ హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు.

"ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థితో పాటు అతని అనుచరులపై దాడి జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. నిందితులు పారిపోతున్న సమయంలో ఇద్దరిని అరెస్టు చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో నలుగురు, ఐదుగురికి సంబంధం ఉంది."

రాకేశ్ కుమార్, సబ్ డివిజనల్ పోలీసు అధికారి

ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట స్థానికులు ధర్నాకు దిగారు. దీంతో బలగాలను మోహరించారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details