తెలంగాణ

telangana

లాలూ సొంత గ్రామంలో విజయంపై ఆర్​జేడీ కన్ను

By

Published : Oct 18, 2020, 11:32 AM IST

Updated : Oct 18, 2020, 11:49 AM IST

ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​.. తన సొంత గ్రామం ఉన్న నియోజకవర్గంలో ఇప్పటివరకు గెలవలేదు. ఇది ఆర్​జేడీ నేతలను కలవరపెడుతోంది. ఈసారి ఎలాగైనా గెలవాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. లాలూ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు.

bihar-elections-rjd-eyes-for-lalus-native-constituency-hathwa
లాలూ సొంత గ్రామంలో విజయంపై ఆర్​జేడీ కన్ను

లాలూ ప్రసాద్​ యాదవ్​... బిహర్​ రాజకీయల్లో ఆయనది చెరగని ముద్ర. అయితే ఎన్నో ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ.. లాలూ సొంత గ్రామంలో ఇప్పటికీ విజయం సాధించలేకపోవడం ఆర్​జేడీ నేతలను కలవరపెడుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ కలను నెరవేర్చుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు.

ఎన్ని చేసినా...

ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ పుట్టింది పుల్వారియా గ్రామంలో. ఆ ప్రాంతం ప్రస్తుతం హథువా నియోజకవర్గం కింద ఉంది. అయితే లాలూ ఇక్కడ ఎప్పుడూ విజయం సాధించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో దీనిపై ఆర్​జేడీ కసరత్తులు ప్రారంభించింది. ఆర్​జేడీ సుప్రీమో సొంత ప్రాంతంలో గెలుపే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో బరిలో దిగుతోంది.

ఇదీ చూడండి-నితీశ్​ నమ్మకద్రోహం చేశారు: లాలూ

మరోవైపు గ్రామ ప్రజల్లో కొంతమంది.. ఈసారి ఆర్​జేడీ పట్ల సానుకూలంగా ఉన్నట్టు కనపడుతోంది. రాష్ట్ర చరిత్రనే మార్చేసిన నేతను చూసి వారు గర్వపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు లాలూ చేసిన అభివృద్ధి పనులను గుర్తుతెచ్చుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ పార్టీయే విజయం సాధించాలని ప్రార్థిస్తున్నారు.

"అధికారంలో ఉన్నప్పుడు పుల్వారియాలో లాలూ అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన ఓటమి తర్వాత ఇక్కడ అసలు అభివృద్ధే జరగలేదు. ప్రజలకు సహాయం చేయడంలో ప్రస్తుత ఎమ్మెల్యే విఫలమయ్యారు. రోడ్డు, విద్య, ఆరోగ్యం, నిరుద్యోగాన్ని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ లాలూ అలా కాదు. అప్పుడప్పుడు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడి ప్రజలను కలిసే వారు. ఈసారి మా ఓటు లాలూ పార్టీకే."

--- పుల్వారియా గ్రామస్థులు

అయితే ఈ విషయంలో గ్రామం రెండుగా చీలిపోయినట్టు కనపడుతోంది. కొందరు ఆర్​జేడీ గెలుపును కోరుకుంటుంటే.. మరికొందరు దాన్ని విభేదిస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా తమకు సహాయం చేయలేదని తేల్చిచెబుతున్నారు.

హథువా ప్రస్తుత ఎమ్మెల్యే జేడీయూకు చెందిన రామ్​సేవక్​ సింగ్​. జేడీయూ మళ్లీ ఆయన్నే ఎన్నికల్లో దింపే అవకాశముంది. అయితే హథువా అసెంబ్లీ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు ఆర్​జేడీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆర్​జేడీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్​ సింగ్​ కుష్వాహాను రంగంలోకి దింపింది. లాలూ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు సంపాదించేందుకు నేతలు ప్రచారాలను ముమ్మరం చేశారు.

ఇవీ చూడండి:-

బిహార్​ బరి: మోదీ సర్కార్​ విజయాలే.. భాజపా ప్రచారాస్త్రాలు!

'ట్రంప్​ వచ్చి బిహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వరు'

Last Updated : Oct 18, 2020, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details