తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మెదడు వాపుతో 14 మంది చిన్నారులు బలి - ముజాఫర్​పూర్

'ఎక్యూట్​ ఎన్​సెఫాలిటీస్​ సిండ్రోమ్ (మెదడు వాపు)' వ్యాధి ప్రభావంతో బిహార్​లో​ 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెదడువాపు​ నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మెదడు వాపుతో 14 మంది చిన్నారులు బలి

By

Published : Jun 9, 2019, 6:36 AM IST

బిహార్​లోని ముజాఫర్​పూర్​లో 'ఎక్యూట్​ ఎన్​సెఫాలిటీస్​ సిండ్రోమ్​' (మెదడు వాపు) తీవ్ర ప్రభావం చూపుతోంది. మొత్తం​ 38 మంది ఈ వ్యాధితో స్థానిక శ్రీ కృష్ణ ఆసుపత్రిలో చేరగా... వీరిలో 14 మంది చనిపోయారని మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారేనని వైద్యులు నిర్ధరించారు. ఈ వ్యాధి సాధారణంగా వర్షాకాలంలో నీటి వలన వస్తుందని తెలిపారు.

మెదడువాపు లక్షణాలు

తీవ్ర జ్వరం, శరీరం సత్తువ కోల్పోవడం మెదడు వాపు​ లక్షణాలని వైద్యులు తెలిపారు. ఇటువంటి లక్షణాలతో ఉన్న పిల్లలను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బిహార్​ వ్యాప్తంగా మెదడు వాపు​పై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.

ఇదీ చూడండి : రైతులందరికీ 'పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి'

ABOUT THE AUTHOR

...view details