తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలును ఆపి.. ఐదుగురి ప్రాణాలు కాపాడారు - Train accident news

బిహార్​లో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాల మధ్యలో చిక్కుకుపోయిన పాఠశాల వాహనాన్ని గమనించిన స్థానికులు.. అదే సమయంలో వస్తున్న రైలును ఆపి, ఐదుగురి ప్రాణాలు కాపాడారు.

Big train accident averted in Lakhisarai
రైలును ఆపి-ఐదుగరి ప్రాణాలు కాపాడారు!

By

Published : Dec 25, 2020, 7:49 PM IST

వేగంగా దూసుకొస్తున్న రైలును ఆపి ఐదుగురి ప్రాణాలను కాపాడిన ఘటన బిహార్​ లఖిసరాయ్​ జిల్లా దైతా డ్యామ్​ రైలు గేటు వద్ద జరిగింది.

ఓ పాఠశాల వాహనం రైలు పట్టాల మధ్యలో చిక్కుపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్​పై ఓ ప్యాసింజర్​ రైలు దూసుకొస్తోంది. దీన్ని గమనించిన స్థానికులు.. వాహనం వద్దకు చేరుకుని ఎర్రని వస్త్రాన్ని ఊపి రైలును ఆపారు. అనంతరం ఆ వాహనాన్ని బయటకు నెట్టి.. ఐదుగురి ప్రాణాలు కాపాడారు. పెను ప్రమాదమే తప్పింది. దీంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

రైలును ఆపి-ఐదుగరు ప్రాణాలు కాపాడారు

ఇదీచూడండి:2 చేతులతో 4 భాషల్లో ఎటు నుంచి ఎటైనా రాసేస్తా!

ABOUT THE AUTHOR

...view details