తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో "రామోజీ ఇళ్లు"

కేరళ వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూపు సంస్థలు కట్టించబోయే ఇళ్లకు భూమిపూజ జరిగింది.

By

Published : Mar 2, 2019, 8:06 PM IST

భూమిపూజ కార్యక్రమం

భూమిపూజ కార్యక్రమం

కేరళ వరదల్లో ఆవాసం కోల్పొయినవారికి ఇళ్లు కట్టించేందుకు రామోజీ గ్రూపు సంస్థలు నడుం బిగించాయి. శనివారంనాడు అలప్పుయా(అలెప్పీ)లో ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి చిట్​ఫండ్స్ ఉపాధ్యక్షుడు రాజాజీ, కుటుంబశ్రీ మిషన్ జిల్లా కార్యకర్తలు హాజరయ్యారు.

కుటుంబశ్రీ మిషన్ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మూడు నెలల్లో పనులు పూర్తయ్యేలా ఉన్నాయని డీఎన్ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. దాతలు ఇచ్చిన ప్రతి రూపాయి బాధితులకు చేరుతుందని హామీ ఇచ్చారు.

మూడు దశల్లో పనులు

కేరళ వరదల్లో అలప్పుయా జిల్లా భారీగా నష్టపోయింది. అందుకే ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టు నిర్వహణకు ఇదే జిల్లాను ఎంచుకుంది రామోజీ గ్రూపు సంస్థ. మొత్తం మూడు దశల్లో 116 ఇళ్ల నిర్మాణాలు జరుగుతాయి. మొదటి రెండు దశల్లో 80 ఇళ్లను, మూడోదశలో మిగిలిన 36 ఇళ్లను నిర్మిస్తారు. ఒక్కో ఇంటిని 400 గజాల స్థలంలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో మొత్తం 116 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

ABOUT THE AUTHOR

...view details