తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​కు ఇవే ఆఖరి ఎన్నికలు!'

"దేశంలో ప్రస్తుతం జరిగే ఎన్నికలే చివరివి. 2024లో మళ్లీ ఎన్నికలు ఉండవు" అని భాజపా ఎంపీ సాక్షి మహరాజ్ జోస్యం చెప్పారు​. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

By

Published : Mar 16, 2019, 1:09 PM IST

'భారత్​కు ఇవే ఆఖరి ఎన్నికలు!'

విమర్శలు, ప్రతివిమర్శలు, పోటాపోటీ ప్రచార సభలతో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్​కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

ఉన్నావ్​లో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు భాజపా ఎంపీ సాక్షి మహరాజ్​. 2024లో లోక్​సభ ఎన్నికలు జరగకపోవచ్చని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల తరహాలో ఈసారీ మోదీ కేంద్రంగానే ఎన్నికలకు వెళ్తామని అన్నారు.

'భారత్​కు ఇవే ఆఖరి ఎన్నికలు!'

2019 ఎన్నికల్లో మోదీ సునామీ ఉంది. నరేంద్రమోదీ మొత్తం ప్రపంచానికే నేత. ఇప్పుడు జరగనున్న ఎన్నికలు పార్టీకి సంబంధించినవి కావు. దేశానికి సంబంధించినవి. మరోసారి దేశం జాగృతం అయింది. ఈ ఎన్నికల తరువాత 2024 ఎన్నికలు జరగకపోవచ్చు అని నాకు అనిపిస్తోంది. కేవలం ఈ ఎన్నికలే జరుగుతాయి. ఇందులో దేశం పేరు మీద పోరాటం జరగనుంది.
- సాక్షి మహరాజ్​, భాజపా ఎంపీ

ABOUT THE AUTHOR

...view details