తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమతపై సుశీల్​ మోదీ మండిపాటు

పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బిహార్​ ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత సుశీల్ మోదీ. హిందీలో మాట్లాడే లక్షలాది మందిని బంగాల్​ నుంచి తరిమేసేందుకు మమత కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

By

Published : Jun 2, 2019, 8:03 AM IST

మమతపై సుశీల్​ మోదీ మండిపాటు

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు భాజపా నేత, బిహార్​ ఉప ముఖ్యమంత్రి సుశీల్​ మోదీ. బంగ్లాదేశ్​ అక్రమ చొరబాటు దారులకు బంగాల్​ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. జై శ్రీరామ్​ అని నినదించినందుకు భాజపా కార్యకర్తల పట్ల మమత వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు సుశీల్. ఈ విషయంపై మమతను విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

" జై శ్రీరామ్​ అని నినదించిన వారి పట్ల మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు, వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూస్తే బంగాల్​లో ఉన్న హిందీ మాట్లాడే వారిని ఆ రాష్ట్రం నుంచి బయటికి పంపాలని కుట్ర చేస్తున్నారనిపిస్తోంది. పశ్చిమ బంగాల్​ ప్రజలకు జై శ్రీరామ్ అని నినదించే హక్కు లేదా?, ఇతర భాషలు మాట్లాడే వారికి బంగాల్​లో నివసించే వీలు ఉండకూడదా?. ఈ విషయాలపై మమత వివరణ ఇవ్వాలి "
-సుశీల్ మోదీ.

ఇటీవల పర్గనాస్​ జిల్లా కంచ్రపారలో టీఎంసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ ప్రదేశానికి సమీపంలో భాజపా కార్యకర్తలు జై శ్రీరామ్​ అంటూ నినాదాలు చేశారు. వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.

ఇదీ చూడండి: 'దీదీకి 10 వేల జై శ్రీరామ్​ పోస్టుకార్డులు'

ABOUT THE AUTHOR

...view details