దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతున్న వేళ తగు జాగ్రత్తలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా.. మాస్క్లు ధరించటం, భౌతిక దూరం పాటించాలని పలు సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలను కోరారు. అయినా.. కొవిడ్ నిబంధనలు బేఖాతరు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనే బెంగళూరు కేఆర్ మార్కెట్లో కనిపించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దసరా-దీపావళి పండుగ సీజన్ నడుస్తోంది. పండుగల వేళ గృహోపకరణాలు, ఫోన్లు, దుస్తులు సహా ఇతర వస్తువల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే బెంగళూరు కేఆర్ మార్కెట్కు వందలాది మంది తరలిరావటంతో రద్దీగా మారింది. చాలా మంది మాస్కులు లేకుండా కనిపించటం గమనార్హం. భౌతిక దూరం నిబంధన మచ్చుకైనా కనిపించలేదు.
రంగంలోకి బీబీఎంపీ మార్షల్స్..