బంగాల్లో కరోనా మరణాల రేటుపై కీలక ప్రకటన చేసింది ఆ రాష్ట్రంలో పర్యటించిన అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం(ఐఎంసీటీ). దేశంలోనే అత్యధిక కొవిడ్-19 మరణాలు రేటు బంగాల్లో నమోదైనట్లు తెలిపింది. ఐఎంసీటీకి నేతృత్వం వహిస్తున్న అపూర్వ చంద్ర.. బంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హాకు ఈమేరకు రేఖ రాశారు.
" రాష్ట్రంలో ఎక్కువ మరణాలు సంభవిస్తుండటం.. పేలవ పర్యవేక్షణతో పాటు తక్కువ పరీక్షలు చేస్తున్నారనేందుకు నిదర్శనం. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్యతో పోలిస్తే.. హెల్త్ బులిటెన్లు, కేంద్రానికి ప్రభుత్వానికి నివేదించే లెక్కల్లో వ్యత్యాసం ఉంది."
- అపూర్వ చంద్ర, ఐఎంసీటీ సారథి
దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లొచ్చిన వారిని గుర్తించడం, క్వారంటైన్కు తరలించడం సహా బంగాల్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలను సేకరిస్తోంది ఐసీఎంటీ బృందం. రెండు వారాలపాటు ఆ రాష్ట్రంలో పర్యటించిన అనంతరం సోమవారం దిల్లీకి పయనమయ్యే ముందుగా.. సీఎస్కు ఈ లేఖ రాశారు అపూర్వ.