తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైనర్​పై సామూహిక అత్యాచారం- ఆపై సెప్టిక్​ ట్యాంకులో..

పశ్చిమ్​ బంగా జల్​పాయ్​గుడిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై కొంతమంది మృగాళ్లు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను చంపి సెప్టిక్ ట్యాంక్​లో పడేశారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు పోలీసులు.

By

Published : Aug 23, 2020, 5:10 AM IST

WB-RAPE
మైనర్​పై సామూహిక హత్యాచారం

బంగాల్​లోని జల్​పాయ్​గుడిలో మానవమృగాలు రెచ్చిపోయారు. ఓ పదహారేళ్ల బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి పాశవికంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ ఇంటిలోని సెప్టిక్​ ట్యాంక్​లో పడేశారు.

ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరికి 8 రోజుల పోలీసు కస్టడీని విధించింది న్యాయస్థానం. ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది..

జిల్లాలోని రాజ్​గంజ్​కు చెందిన మైనర్ బాలిక.. ఆగస్టు 10 నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయమై ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి విచారించగా బాలికను ఆగస్టు 15న అత్యాచారం చేసి చంపేసినట్లు అంగీకరించారు.

ఉరి తీయాలని డిమాండ్..

హత్యాచార ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ఖగేశ్వర్​ రాయ్​ స్పందించారు.

"ఆగస్టు 11న పోలీసులు కేసు నమోదు చేసుకుంటే.. శవం లభించే వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ చర్యకు పాల్పడినవారిని ఉరితీయాలి." అని రాయ్​ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:ఇంత ప్రేమ నాకొద్దు బాబోయ్​.. విడాకులిప్పించండి ప్లీజ్​!

ABOUT THE AUTHOR

...view details