తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నితీశ్​తో జాగ్రత్త'.. భాజపాకు కుశ్వాహా హెచ్చరిక

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ భాజపాకు మరోసారి ధోకా ఇస్తారని హెచ్చరించారు ఆర్​ఎల్​ఎస్​పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహ. నమ్మక ద్రోహం చేయడం, మిత్ర పక్షాలను మోసగించటం నితీశ్​కు అలవాటే అని చెప్పారు.

By

Published : Jun 3, 2019, 8:20 AM IST

Updated : Jun 3, 2019, 10:48 AM IST

'నితీశ్​తో జాగ్రత్త'.. భాజపాకు కుశ్వాహా హెచ్చరిక

నితీశ్​తో జాగ్రత్త అని కుశ్వాహా హెచ్చరిక

భాజపాను జేడీయూ అధ్యక్షుడు నితీశ్​ కుమార్​ రెండోసారి మోసం చేస్తారని హెచ్చరించారు రాష్ట్రీయ లోక్​ సమతా పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వాహా. త్వరలోనే ఇది జరుగుతుందని జోస్యం చెప్పారు. బిహార్ పట్నాలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు కుశ్వాహా.

నమ్మక ద్రోహం చేయటం, కూటమి పక్షాలను మోసగించడం నితీశ్​కు అలవాటేనని విమర్శించారు కుశ్వాహా. ఆయన చేతిలో మోసపోని వారు ఎవరూ లేరన్నారు. భాజపా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ భాగస్వామ్యం కాకపోవడంపై ఛలోక్తులు విసిరారు కుశ్వాహా. బిహార్​లో ఆర్​జేడీ, కాంగ్రెస్​, ఆర్​ఎల్​ఎస్​పీ, హెచ్​ఏఎం కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'ఎన్​డీఏ- నితీశ్​కు మధ్య ఇబ్బందులు లేవు'

Last Updated : Jun 3, 2019, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details