తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యాచకుడిగా మారిన ఇంజినీరు​.. ఎందుకో తెలుసా? - ఒడిశా సుప్రసిద్ధ పూరీ జగన్నాధాలయం వద్ద ఓ యాచకుడు, రిక్షా కార్మికుడికి మధ్య వాగ్వీవాదం

ఒడిశాలో ఇంజినీరుగా పట్టాపొంది, మంచి ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి యాచకుడి అవతారమెత్తాడు. అందరూ విస్తుపోయే ఈ నిజం.. ఓ ఘర్షణ పర్యవసానంగా వెలుగులోకి వచ్చింది. ఏంటీ కథ..!

btech
యాచకుడిగా మారిన ఇంజినీరు​.. ఎందుకో తెలుసా?

By

Published : Jan 19, 2020, 11:12 AM IST

యాచకుడిగా మారిన ఇంజినీరు​.. ఎందుకో తెలుసా?

ఒడిశా సుప్రసిద్ధ పూరీ జగన్నాధాలయం వద్ద ఓ యాచకుడు, రిక్షా కార్మికుడికి మధ్య జరిగిన బాహాబాహీ నమ్మశక్యం కాని ఓ నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. అత్యున్నతస్థాయి అధికారి కుటుంబం నుంచి వచ్చి, ఇంజినీరింగ్‌ చదివి, మంచి ఉద్యోగం చేసి.. చివరకు భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తిగతాన్ని కళ్లెదుట ఆవిష్కరించింది.

గొడవతో వెలుగులోకి నిజం

జగన్నాధాలయం వద్ద శుక్రవారం నాడు ఓ యాచకుడు, రిక్షా కార్మికుడికి మధ్య తగాదా జరిగింది. ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చి.. పోలీసుల వరకు చేరింది. గాయపడిన వాళ్లిద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు అధికారులు. ఆ తర్వాత యాచకుడు లిఖిత పూర్వకంగా సమర్పించిన ఫిర్యాదును చూసి పోలీసు సిబ్బంది అవాక్కయిపోయారు.

చక్కటి ఇంగ్లిషులో రాసి ఉన్న ఆ ఉత్తరాన్ని చూసి.. ఎదురుగా నిలుచుని ఉన్న యాచకుడికేసి ఆశ్చర్యంగా చూశారు. ఆ తర్వాత ప్రశ్నల వర్షంతో విచారించాగ... అతను ఓ మాజీ డీఎస్పీ పుత్రుడని, ఇంజినీరుగా పట్టా పొంది మంచి ఉద్యోగం కూడా చేశాడని తెలుసుకుని కంగుతిన్నారు.

"మాది భువనేశ్వర్‌. నా పేరు గిరిజా శంకర్‌మిశ్రా. మిల్టన్‌ కంపెనీలో ఇంజినీరుగా పనిచేసేవాడిని. మా నాన్నగారు డీఎస్పీగా పనిచేసి కొన్నేళ్ల క్రితం మరణించారు. అమ్మ కూడా కాలం చెల్లింది. మానసిక ఇబ్బందుల వల్లే ఇల్లూ, ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయాను. ఆకలిని తీర్చుకోవడానికి యాత్రాస్థలాల్లో యాచన చేస్తున్నాను. ఇటీవలే సొంతూరికి వచ్చాను, కుటుంబసభ్యులెవరినీ కలుసుకోలేదు."

- గిరిజా శంకర్‌మిశ్రా

ఈ వివరాలు తెలుసుకున్న అధికారులు యాచకుడి కుటుంబాన్ని వెతికే పనిలో పడ్డారు.

ఇదీ చూడండి : ఔను! లంఖణం పరమౌషధమే!

ABOUT THE AUTHOR

...view details