తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీవీ పేలి ముగ్గురు చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్​లో టీవీ పేలి ముగ్గురు చిన్నారులు బలయ్యారు. బదాయూ జిల్లా, కౌఠోలీ గ్రామంలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. టీవీ ఒక్కసారిగా పేలి ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో పక్క గదిలో ఉన్న మరో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి.

By

Published : Apr 3, 2019, 1:26 PM IST

Updated : Apr 3, 2019, 2:52 PM IST

టీవీ పేలిపోయి ముగ్గురు చిన్నారులు బలి

టీవీ పేలి ముగ్గురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్​ బదాయూ జిల్లాలోని కౌఠోలీ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో టెలివిజన్​ పేలి ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో టీవీ చూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పడు కుటుంబసభ్యులు వేరే ఇంట్లో ఉన్నందున ఉదయం వరకూ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. తీరా ఇంటికి వచ్చాక విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇదీ జరిగింది

కౌఠోలీ గ్రామంలోని ఓ ఇంట్లో ఐదుగురు చిన్నారులు అర్ధరాత్రి ఒకే గదిలో టీవీ చూస్తున్నారు. ఉన్నట్లుండి కరెంట్​ పోయింది... అనంతరం ఓ చిన్నారి వారి ఇంటికి వెళ్లిపోయింది. మరొకరు ఆ గది నుంచి బయటకు వచ్చి వేరే గదిలో పడుకున్నారు. మిగతా ముగ్గురూ అదే గదిలో ఉన్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కరెంట్ తిరిగొచ్చింది. చిన్నారులు టీవీని మళ్లీ ఆన్​ చేసే ప్రయత్నం చేశారు. ఉన్నట్లుండి టెలివిజన్​ పేలి ముగ్గురు చిన్నారులు బలయ్యారు.

Last Updated : Apr 3, 2019, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details