తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'77కేజీల బంగారం చోరీ' ముఠా అరెస్టు - 77కేజీల బంగారం చోరీ ముఠాను ఛేదించిన పోలీసులు

కర్ణాటక బెంగళూరులోని ముత్తూట్​ ఫైనాన్స్​లో గతనెలలో 77కేజీల బంగారం చోరీకి పాల్పడిన కేసును ఛేదించి పట్టుకున్నారు పోలీసులు. నేపాల్​లో ఈ దొంగల ముఠాను గుర్తించారు.

bangalore police
77కిలోల బంగారం చోరి సూత్రధారి...'గ్యాంగ్​లీడర్'​​

By

Published : Jan 1, 2020, 8:39 PM IST

Updated : Jan 2, 2020, 10:11 AM IST

కర్ణాటక బెంగళూరులో సినీఫక్కీలో చోరికి పాల్పడి 77 కేజీల బంగారాన్ని దోచుకున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. నేపాల్​లో తలదాచుకున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 8.6కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

సినీఫక్కీలో..

గతేడాది డిసెంబర్​ 22న బెంగళూరు పులకేశినగర్​లోని ముత్తూట్​ ఫైనాన్స్​ గోడకు కన్నం వేసి 77కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. వీరికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు కర్ణాటక పోలీసులు. దుండగులు నేపాల్​లో తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లారు. ముఠాలోని నలుగురికి అదుపులోకి తీసుకున్నారు.

బిహార్ గ్యాంగ్​లీడర్...​

బిహార్​కు చెందిన ఓ గ్యాంగ్ లీడర్ ఈ చోరీకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు.​ నేపాల్​కు చెందిన సెక్యూరిటీ గార్డుల సాయంతో 12 మంది దుండగులతో కలిసి ఈ చోరీకి పాల్పడ్డట్టు పేర్కొన్నారు. చోరీ అనంతరం దుండగులు రెండు బృందాలుగా విడిపోయి బంగారాన్ని సమంగా పంచుకున్నారని తెలిపారు. ఓ బృందం దిల్లీ పరారవ్వగా.. మరో బృందం నేపాల్ వెళ్లినట్లు వివరించారు.

ప్రధాన సూత్రధారి సహా మిగతా నిందితుల కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి : 'న్యూఇయర్​ కానుకగా రైల్ ఛార్జీలు, గ్యాస్​ ధరల పెంపు'

Last Updated : Jan 2, 2020, 10:11 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details