కర్ణాటక బెంగళూరులో సినీఫక్కీలో చోరికి పాల్పడి 77 కేజీల బంగారాన్ని దోచుకున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. నేపాల్లో తలదాచుకున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 8.6కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
సినీఫక్కీలో..
గతేడాది డిసెంబర్ 22న బెంగళూరు పులకేశినగర్లోని ముత్తూట్ ఫైనాన్స్ గోడకు కన్నం వేసి 77కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. వీరికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు కర్ణాటక పోలీసులు. దుండగులు నేపాల్లో తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లారు. ముఠాలోని నలుగురికి అదుపులోకి తీసుకున్నారు.