తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బదాయూ' నిందితుడి కోసం ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ - బదాయూ ఘటన యోగి ఆదిత్యనాథ్​

ఉత్తరప్రదేశ్​ బదాయూలో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటనపై సీఎం యోగి అదిత్యనాథ్​ స్పందించారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్​ చేసేందుకు ఎస్​టీఎఫ్​ను ఏర్పాటు చేశారు. మరో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Badaun horror
'బదాయూ' నిందితుల కోసం ప్రత్యేక టాస్క్​ఫోర్స్​

By

Published : Jan 7, 2021, 3:52 PM IST

బదాయూ సామూహిక అత్యాచార ఘటన ప్రధాన నిందితుడిని అరెస్ట్​ చేసేందుకు ప్రత్యేక్​ టాస్క్​ఫోర్స్​(ఎస్​టీఎఫ్​)ను ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. మొత్తం ముగ్గురు నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

జనవరి 3న బదాయూ జిల్లాలోని ఉగైతీ ప్రాంతంలో 50ఏళ్ల మహిళా అంగన్​వాడీ కార్యకర్తపై అత్యాచారం జరిగింది. దేవుడి దర్శనం కోసం ఓ ఆలయానికి వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

నిందితులైన ఆలయ పూజారి, అతని ఇద్దరు శిష్యులపై ఉగైతీ పోలీస్​ స్టేషన్​లో ఐపీసీ సెక్షన్​ 376-డీ(సామూహిక అత్యాచారం), 302(మర్డర్​)కింది కేసు నమోదు చేశారు. ఇద్దరు శిష్యులను అరెస్టు చేయగా... పూజారి పరారీలో ఉన్నాడు.

ఇదీ చూడండి:- యోగీ సర్కార్ ఉద్దేశాల్లోనే లోపం: ప్రియాంక

ABOUT THE AUTHOR

...view details