తెలంగాణ

telangana

By

Published : Sep 24, 2019, 10:01 PM IST

Updated : Oct 1, 2019, 9:35 PM IST

ETV Bharat / bharat

ఆరోగ్యానికి ఆయుర్వేదం చికిత్స అండ!

ఉచిత ఆరోగ్య బీమా పథకం- ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(పీఎంజేఏవై)లో  19 రకాల ప్యాకేజీలను జత చేయాలని కోరుతూ నివేదికను పంపినట్లు కేంద్ర మంత్రి శ్రీపాద్​ నాయక్​ తెలిపారు. దీనిలో ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి చికిత్స ప్యాకేజీలు ఉన్నాయి.

ఆరోగ్యానికి ఆయుర్వేదం చికిత్స అండ!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత ఆరోగ్య బీమా పథకం- ప్రధానమంత్రి జన్​ ఆరోగ్య యోజనలో 19 రకాల చికిత్స ప్యాకేజీలను జత చేయాలనే ప్రతిపాదనను ఆయుష్​ మంత్రిత్వశాఖ పంపినట్లు కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఇతర వ్యాధులకు సంబంధించిన నివేదికను జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థకు అందించినట్లు ఆయుష్​ కార్యదర్శి వైద్య రాజేశ్​ తెలిపారు.

ఆయుష్​ చికిత్సకు సంబంధించిన బీమాను పొడిగించే ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు నాయక్​ పేర్కొన్నారు. జాతీయ ఆయుష్​ మిషన్ పథకం ద్వారా ప్రతి రాష్ట్రానికి రూ. 325 కోట్లు నిధులను విడుదల చేశారు. నీతి ఆయోగ్​, ఇన్వెస్ట్​ ఇండియా సహాయంతో ఇంటిగ్రేటెడ్​ హెల్త్ రీసెర్చ్ కోసం పథకాన్ని రూ.490 కోట్ల వ్యయంతో తీసుకొచ్చారు. దీని ద్వారా ఆధునిక వైద్యంతో పరిష్కరించలేని వాటిని ఆయుష్​ పద్దతి ద్వారా నిర్మూలించవచ్చని తెలిపారు కేంద్ర మంత్రి.

ప్రధానమంత్రి జన్​ ఆరోగ్య యోజన పథకానికి ఆయుష్​ జత చేస్తే ప్రజలు ఈ పద్దతి ద్వారా చికిత్స చేసుకుంటారని నాయక్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:భూకంపం దాటికి గజగజ వణికిన ఉత్తర భారతం

Last Updated : Oct 1, 2019, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details