తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్యలో భూసేకరణపై సుప్రీంలో వ్యాజ్యం

వివాదాస్పద రామజన్మభూమి వద్ద భూసేకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్​ దాఖలైంది.

By

Published : Feb 4, 2019, 5:08 PM IST

అయోధ్యలో భూసేకరణపై సుప్రీంలో వ్యాజ్యం

అయోధ్యలో భూసేకరణపై సుప్రీంలో వ్యాజ్యం
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాల భూసేకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్​ దాఖలైంది. 1993లో కేంద్రం చేసిన ఈ చట్టాన్ని సవాల్​ చేస్తూ కొంత మంది న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు.

బాబ్రీ ఘటన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్‌ప్రదేశ్‌ పరిధిలోని భూమికి సంబంధించి చట్టం చేసే అధికారం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. రామ్‌లల్లా భక్తులమంటూ కొందరు న్యాయవాదుల బృందం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఒకరాష్ట్రం పరిధిలోని ఆధ్యాత్మిక సంస్థల నిర్వహణకు సంబంధించి చట్టాలు చేసే ప్రత్యేక అధికారం రాష్ట్ర శాసనసభలకే ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details