తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రామ మందిరానికి ముస్లింలు.. స్థలమివ్వాలి' - రామ మందిర నిర్మాణానికి ముస్లింలు అనుమతివ్వాలని ముస్లిం మేధావుల వేదిక అభిప్రాయపడింది

రామ-జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి కోర్టు బయట పరిష్కారమే మేలని ముస్లిం మేధావుల వేదిక అభిప్రాయపడింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ముస్లింలు అడ్డు చెప్పకూడదని పేర్కొంది.

'రామ మందిరానికి ముస్లింలు.. స్థలమివ్వాలి'

By

Published : Oct 11, 2019, 6:00 AM IST

Updated : Oct 11, 2019, 7:00 AM IST

ఆయోధ్య భూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రామ జన్మ భూమి-బాబ్రీ మసీదు కేసులో కోర్టు వెలుపల పరిష్కారమే సరైన మార్గమని ముస్లిం మేధావుల వేదిక అభిప్రాయపడింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ముస్లింలు వ్యతిరేకించకూడదని సూచించింది.

అయోధ్య కేసులో పిటీషనర్లుగా ఉన్న ముస్లింలు.. రామమందిర నిర్మాణానికి తమవంతు భూభాగాన్ని హిందూ పక్షానికి ఇవ్వడం మేలని మేధవుల వేదిక ప్రతిపాదించింది. ఈ కేసులో ముస్లింలు గెలిచినా.. ఇదే పంథాను పాటించడం ఉత్తమమని పేర్కొంది.

మాజీ ఐఏఎస్​ అధికారి అనీస్ అన్సారీ, మాజీ ఐపీఎస్​ నిసార్ అహ్మద్​, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దిన్ షా, పద్మశ్రీ గ్రహిత మన్సూర్ అహ్మద్, ఉత్తరప్రదేశ్​ మాజీ మంత్రి మొయీన్ అహ్మద్​లు సభ్యులుగా ఉన్న 'ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ పీస్​' వేదిక ఈ విషయాలు వెల్లడించింది.

ఇదీ చూడండి: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మూడేళ్లుగా కుట్ర!

Last Updated : Oct 11, 2019, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details