ఆయోధ్య భూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రామ జన్మ భూమి-బాబ్రీ మసీదు కేసులో కోర్టు వెలుపల పరిష్కారమే సరైన మార్గమని ముస్లిం మేధావుల వేదిక అభిప్రాయపడింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ముస్లింలు వ్యతిరేకించకూడదని సూచించింది.
అయోధ్య కేసులో పిటీషనర్లుగా ఉన్న ముస్లింలు.. రామమందిర నిర్మాణానికి తమవంతు భూభాగాన్ని హిందూ పక్షానికి ఇవ్వడం మేలని మేధవుల వేదిక ప్రతిపాదించింది. ఈ కేసులో ముస్లింలు గెలిచినా.. ఇదే పంథాను పాటించడం ఉత్తమమని పేర్కొంది.