తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య కేసుపై సత్వర విచారణకు అభ్యర్థన

అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ స్థల వివాదంపై సత్వరమే విచారణ చేపట్టాలని కేసులోని ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దరఖాస్తు చేయాలని న్యాయస్థానం సూచించింది.

By

Published : Jul 9, 2019, 12:29 PM IST

అయోధ్య

అయోధ్యపై సత్వర విచారణ జరపాలని అభ్యర్థించారు కేసులోని ఫిర్యాదుదారు గోపాల్​ సింగ్ విశారద్​. సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఎఫ్​ఎం ఖలీఫుల్లా నేతృత్వంలో మధ్యవర్తి కమిటీ ఏర్పాటైనా ఎలాంటి ప్రగతి లేదని ఆరోపించారాయన.

విశారద్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది పి.ఎస్. నరసింహ అభ్యర్థనను పరిశీలించింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. సత్వర విచారణ కోసం దరఖాస్తు దాఖలు చేశారా అని ప్రశ్నించింది. స్పందించిన న్యాయవాది అందుకు ఔనని సమాధానమిచ్చారు.

ఇదీ చూడండి: ఆధార్​ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details