తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలున్నారు' - విచారణ

వివాదాస్పద అయోధ్య కేసుపై 7వ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయోధ్య వివాదాస్పద భూమిలో ఉన్న స్తంభాలపై హిందూ దేవతల చిత్రాలున్నాయని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు రామ్​లల్లా తరఫు న్యాయవాది. భూమిని పరీక్షించడానికి కోర్టు నియమించిన కమిషనర్ అందించిన​ నివేదిక ద్వారా ఇది స్పష్టమవుతోందని అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు.

'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలు'

By

Published : Aug 16, 2019, 1:37 PM IST

Updated : Sep 27, 2019, 4:41 AM IST

అయోధ్య భూవివాదంపై 7వ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. శుక్రవారం రామ్​లల్లా తరఫు న్యాయవాది వైద్యనాథన్​ వాదనలు వినిపించారు. వివాదాస్పద అయోధ్య భూమి వద్ద ఉన్న స్తంభాలపై అనేక హిందూ దేవతల చిత్రాలున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి తెలిపారు వైద్యనాథన్​.

వివాదాస్పద భూమిని పరీక్షించిన అనంతరం కమిషనర్​ అందించిన నివేదికను ధర్మాసనానికి చదివి వినిపించారు వైద్యనాథన్​. కోర్టు నియమించిన కమిషనర్​ ఏప్రిల్​ 16, 1950లో భూమిని పరీక్షించారు. అక్కడి స్తంభాలపై దేవతల చిత్రాలు ఉన్నాయని కమిషనర్​ తన నివేదికలో పేర్కొన్నట్టు న్యాయవాది తెలిపారు. ఇలాంటివేవీ మసీదుల్లో కనపడే ఆస్కారం లేదని వైద్యనాథన్ వివరించారు.

ఇదీ చూడండి:- అత్తివరధర్​ ఆలయానికి కోటి మంది భక్తులు!

Last Updated : Sep 27, 2019, 4:41 AM IST

ABOUT THE AUTHOR

...view details