తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చలి చంపుతోంది.. మద్యం సేవించకండి: ఐఎండీ

ప్రస్తుత పరిస్థితుల్లో మద్యపానానికి దూరంగా ఉండటమే మేలు అంటోంది భారత వాతావరణ శాఖ. 'మద్యం సేవించకండి.. శరీర ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి' అంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. చలి తీవ్రత పెరుగుతుండటమే దీనికి కారణం. రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర చలి ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

By

Published : Dec 27, 2020, 5:44 AM IST

చలి తీవ్రత పెరుగుతున్న వేళ మద్యపానానికి దూరంగా ఉండాలని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో చలి తీవ్రత అధికంగా ఉందని, అందువల్ల ఇంట్లో లేదా కొత్త సంవత్సర వేడుకల్లో మద్యానికి దూరంగా ఉండటమే మేలు అని తెలిపారు.

పంజాబ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తర రాజస్థాన్‌లలో డిసెంబర్‌ 28 నుంచి తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఫ్లూ, ముక్కుకారడం వంటి ఆరోగ్య ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యపానం శరీర ఉష్ణోగ్రతలను మరింతగా తగ్గించి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, విటమిన్‌ సీ పుష్కలంగా ఉండే పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఈ చలి తీవ్రతకు శరీరం పాడవ్వకుండా మాయిశ్చరైజర్లు వాడాలని సూచించారు.

చల్లనిగాలులతో జాగ్రత్త..

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో మంచు భారీగా కురిసే అవకాశం ఉందని, హిమాలయాల నుంచి వీచే చల్లని గాలులతో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: రాబోయే రెండు రోజులు బీ అలర్ట్​.. పెరగనున్న చలి తీవ్రత

ABOUT THE AUTHOR

...view details