తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓవర్​టేక్​ చేసినందుకు ఆటోడ్రైవర్​ హత్య! - overtaking

తమిళనాడులో ఓ ఆటో డ్రైవర్​, ఇద్దరు ద్విచక్రవాహనదారుల మధ్య మొదలైన చిన్న గొడవ... హత్యకు దారితీసింది. ఓవర్​టేక్​ చేశాడన్న ఆగ్రహంతో ఆటో డ్రైవర్​ను కిరాతకంగా కొట్టిచంపారు ఇద్దరు వ్యక్తులు.

ఓవర్​టేక్​ చేసినందుకు ఆటోడ్రైవర్​ హత్య!

By

Published : Sep 29, 2019, 3:54 PM IST

Updated : Oct 2, 2019, 11:27 AM IST


తమిళనాడు కోయంబత్తూర్​లో​ ఇద్దరు దుండగులు విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. తమ ద్విచక్రవాహనాన్ని అధిగమించినందుకు ఆటో డ్రైవర్​ను నిర్దాక్షిణ్యంగా చంపేశారు.

ఓవర్​టేక్​ చేసినందుకు ఆటోడ్రైవర్​ హత్య!

కీరనాథంలో ఆరుణ్​ ప్రసాద్​ అనే ఆటో డ్రైవర్​కు, ద్విచక్రవాహనంపై వెళ్తున్న మరో ఇద్దరికి... ఓవర్​టేక్​ చేసే విషయంలో గొడవ మొదలైంది. కాసేపటికి అరుణ్​ ఓ హోటల్​ దగ్గర టీ తాగడానికి ఆటో ఆపాడు. వెంటనే అక్కడికి వచ్చిన దుండగులు... "మా వాహనాన్నే అధిగమిస్తావా" అంటూ వాదనకు దిగారు. ఘర్షణ తీవ్రరూపు దాల్చింది. బైక్​పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు... భవన నిర్మాణంలో ఉపయోగించే ఇనుప పనిముట్టుతో ఆటోడ్రైవర్​ను చితకబాదారు. కొన ఊపిరితో ఉన్న అరుణ్​ను అక్కడి వదిలేసి పారిపోయారు.

నెత్తుటి మడుగులో పడి ఉన్న ఆటోడ్రైవర్​ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అరుణ్​ ప్రాణాలు విడిచాడు.

ఇదీ చూడండి:సీబీఎల్​: 4వ విజయం ఖాతాలో వేసుకున్న 'నడుభాగం'

Last Updated : Oct 2, 2019, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details