తెలంగాణ

telangana

టోల్​గేట్​ వద్ద లారీ బీభత్సం- ఇద్దరు మృతి

By

Published : Dec 2, 2019, 10:19 AM IST

తమిళనాడులోని ఓ టోల్​ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా టోల్​బూత్​ను ఢీకొట్టి, ద్విచక్రవాహనదారునికిపైకి ఎక్కేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

at tanmilnadu  krisnagiri toll plaza lorry lost speed and control, then collided with toll booth and the two-wheeler. In this incident Two of them died on the spot.
టోల్​బూత్​ను లేపేసి.. బైక్​ను ఢీకొట్టిన లారీ

టోల్​బూత్​ను లేపేసి.. బైక్​ను ఢీకొట్టిన లారీ
తమిళనాడు కృష్టగిరిలో ఘోర ప్రమాదం జరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే టోల్​ప్లాజా వద్ద ఓ లారీ విధ్వంసం సృష్టించింది. ఇద్దరు వ్యక్తులను బలిగొంది.
వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ అదుపు తప్పింది. టోల్​బూత్​ను ధ్వంసం చేసింది. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది.

ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు.. చిన్న పిల్లలు కూర్చున్న ఓ బైక్​ ఆ ప్రమాద ప్రదేశంలో ఉంది. అయితే.. అదృష్టవశాత్తు ఒక్క క్షణం ముందు ఆ వాహనం ముందుకు వెళ్లడం వల్ల చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details