దిల్లీ రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీలోని నాలుగు అంతస్థుల భవనంలో ఈరోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో అనేక మంది కూలీల బతుకులు బుగ్గి పాలయ్యాయి. భవనంలో బ్యాగుల తయారీ పరిశ్రమలో కార్మికులు నిద్రలో ఉండగా ఉదయం 5 గంటల సమయంలో షార్ట్ సర్య్యూట్ జరిగింది. దీంతో అగ్ని ప్రమాదం సంభవించింది. కొందరు మంటల్లో కాలి బూడిద కాగా.... ఎక్కువ మంది కార్బన్ మోనాక్సైడ్ వాయువుల వల్ల ఊపిరి ఆడక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 150 మంది అగ్నిమాపక సిబ్బంది 35 శకటాలతో రంగంలోకి దిగి 63 మందిని రక్షించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు.
సహాయక చర్యలకు ఇబ్బంది
ప్రమాదం జరిగిన ప్రదేశం ఇరుకుగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తింది. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు చేరుకోవడం కష్టమైంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది భుజాలపై మోసుకుని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. క్షతగాత్రులను రాంమనోహర్ లోహియా, హిందూరావు ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భవన యజమాని అరెస్ట్
...
అగ్నిప్రమాదం జరిగిన భవనం యాజమాని రెహన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భవనానికి ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని... అధికారులు తెలిపారు.
కేజ్రీవాల్ పరామర్శ