తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జీ-7 సదస్సు: ప్లాస్టిక్​ భూతంపై మోదీ ప్రసంగం - మార్పు

జీ-7 సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ పర్యావరణ పరిరక్షణకు భారత్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్‌ను భారతావని నుంచి తొలగించేందుకు తీసుకోనున్న చర్యలను పేర్కొన్నారు.

జీ-7 సదస్సు: ప్లాస్టిక్​ భూతంపై మోదీ ప్రసంగం

By

Published : Aug 27, 2019, 5:30 AM IST

Updated : Sep 28, 2019, 10:12 AM IST

జీ-7 సదస్సు: ప్లాస్టిక్​ భూతంపై మోదీ ప్రసంగం

ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ ఆహ్వానం మేరకు జీ-7 సమావేశాలకు ప్రత్యేక అతిథిగా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా పునర్వినియోగానికి పనికారని ప్లాస్టిక్​ను భారత్​ నుంచి తొలగించేందుకు చేపడుతున్న చర్యలను వివరించినట్లు భారత విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీశ్​ కుమార్​ ట్వీట్​ చేశారు.

రవీస్​ కుమార్​ ట్వీట్

నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, వృక్ష- జంతు సంపద కాపాడుకునేందుకు అనుసరిస్తోన్న విధానాలను జీ-7 సదస్సులో మోదీ వినిపించినట్లు రవీస్​ పేర్కొన్నారు.

యునెస్కోలో..

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 23న నిర్వహించిన కార్యక్రమంలో వాతావరణ మార్పులపై భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. వాతావరణ మార్పులపై కాన్ఫరెన్స్​ ఆఫ్​ ది పార్టీస్​ (సీఓపీ-21) 2030కి నిర్దేశించిన లక్ష్యాలను రాబోయే ఏడాది లేదా ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని తెలిపారు.

Last Updated : Sep 28, 2019, 10:12 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details