తెలంగాణ

telangana

By

Published : Aug 9, 2020, 5:50 PM IST

Updated : Aug 13, 2020, 10:59 AM IST

ETV Bharat / bharat

'హిందీ వచ్చిన వారే భారతీయులా?'

తనకు హిందీ రాదని.. అందువల్ల తనతో తమిళం, ఆంగ్ల భాషల్లో మాట్లాడాలని కోరిన డీఎంకే ఎంపీ కనిమొళికి చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. హిందీ రాదన్న కారణంతో ఓ సీఐఎస్​ఎఫ్​​ మహిళా అధికారి తనను భారతీయురాలినా? కాదా? అని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై ట్విట్టర్​ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Asked whether or not I am Indian on stating I did not know Hindi: DMK's Kanimozhi on airport incident
'హింది రాకపోతే భారతీయురాలినేనా అని ప్రశ్నించారు'

డీఎంకే ఎంపీ కనిమొళికి ఆదివారం చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. దిల్లీకి వెళ్తోన్న సమయంలో.. తాను భారతీయురాలినా? కాదా? అని ఓ సీఐఎస్​ఎఫ్​ అధికారి తనను ప్రశ్నించినట్లు ఆమె వెల్లడించారు. తనకు హిందీ రాదని.. తమిళం లేదా ఆంగ్ల భాషలో మాట్లాడమని అభ్యర్థించగా ఆ మహిళా అధికారి ఈ ప్రశ్న అడిగినట్టు తెలిపారు.

"నాకు హిందీ రాకపోవడం వల్ల తమిళం-ఆంగ్లంలో మాట్లాడమని కోరా. అసలు 'మీరు భారతీయురాలేనా?' అని ఆ అధికారి నన్ను ప్రశ్నించారు. భారతీయత అంటే హిందీ తెలిసి ఉండడం అని ఎప్పటి నుంచి పరిగణిస్తున్నారో తెలుసుకోవాలని ఉంది."

--- కనిమొళి, డీఎంకే నేత.

హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే అర్థం వచ్చే హ్యాష్​ట్యాగ్​తో ట్విట్టర్​లో ఈ పోస్ట్ చేశారు కనిమొళి.

ఈ ట్వీట్​పై కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం స్పందించింది. కనిమొనిళికి ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తూ.. ఘటనకు సంబంధించిన వివరాలను తెలపాలని కోరింది.

ఇదీ చూడండి:-

'మూడు మాకొద్దు.. రెండు భాషలే ముద్దు!'

Last Updated : Aug 13, 2020, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details