తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ బలగాల దుశ్చర్య- భారత జవాను మృతి

జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ బలగాల ఆగడాలు కొనసాగుతున్నాయి. రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై కాల్పులకు పాల్పడ్డాయి పాక్‌ దళాలు. ఈ ఘటనలో ఒక భారత జవాను ప్రాణాలు కోల్పోయారు.

By

Published : Aug 23, 2019, 1:57 PM IST

Updated : Sep 27, 2019, 11:52 PM IST

పాక్​ బలగాల దుశ్చర్య-భారత జవాను మృతి

సరిహద్దు వెంబడి పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్థాన్​. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతోంది. శుక్రవారంజమ్ముకశ్మీర్​లోనిరాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్​లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్​​ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయారు.

కల్‌సియా గ్రామం వద్ద ఉన్న సైనిక స్థావరంలో జవాను పహారా కాస్తుండగా పాక్​ దళాలు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాయి. ఈ కాల్పుల్లో జవాను తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన సైనిక ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పాకిస్థాన్‌ కాల్పులకు భారత్ దీటుగా స్పందించింది.

ఆగస్టు 17వ తేదీ నుంచి రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లో పాక్‌ కాల్పుల కారణంగా ఇప్పటి వరకు నలుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: తమిళనాట ఉగ్ర కలకలం... సర్వత్రా హైఅలర్ట్

Last Updated : Sep 27, 2019, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details