జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా.. ఆర్మీ జవాను ఒకరు వీరమరణం పొందారు.
దోడాకు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టా- పోట్రా గ్రామంలో ముష్కరులు ఉన్నట్లు సమాచారం అందగా... పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టింది సైన్యం. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జవానుకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాతకానికి పాల్పడిన ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకున్నట్లు వెల్లడించారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థకు చెందిన సభ్యుడ్ని మట్టుబెట్టినట్లు తెలిపారు.