నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్లో సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యం సోమవారం ప్రకటించింది.
పాక్ బలగాల కాల్పుల్లో సైన్యాధికారి మృతి - పాక్ వక్రబుద్ది సరిహద్దుల్లో కాల్పులు
పాకిస్థాన్ మరోసారి జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో సోమవారం ఓ భారత జూనియర్ కమిషన్డ్ అధికారి ప్రాణాలు కోల్పోయారు.
![పాక్ బలగాల కాల్పుల్లో సైన్యాధికారి మృతి Indian JCO killed in Pak Army firing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9063426-848-9063426-1601918964485.jpg)
పాక్ ఆర్మీ కాల్పుల్లో భారత జవాన్ మృతి
రాజౌరీ జిల్లాలో నౌషెరా సెక్టార్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఐదు రోజుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడటం వల్ల.. నలుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:పాక్ 'బ్లాక్లిస్ట్' భవితవ్యం తేలేది ఈ నెలలోనే