తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దుల్లో గస్తీ ముమ్మరం- రాజ్​నాథ్​ సమీక్ష

రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్​తో భేటీ అయ్యారు సైనికాధిపతి నరవాణె. సరిహద్దు ఘర్షణల అనంతరం రెండు రోజులపాటు లద్దాఖ్​లో పర్యటించిన నరవాణె క్షేత్రస్థాయి పరిస్థితులపై రాజ్​నాథ్​కు వివరించారని తెలుస్తోంది. అటు సరిహద్దులో బలగాల సంఖ్యను క్రమంగా పెంచుతోంది సైన్యం. యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తోంది వాయుసేన.

By

Published : Jun 26, 2020, 4:28 PM IST

naravane
సరిహద్దు రక్షణపై రాజ్​నాథ్​తో నరవాణె భేటీ

సైనికాధిపతి నరవాణె రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో భేటీ అయ్యారు. లద్దాఖ్​ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై వివరించారు. రెండు రోజులపాటు తూర్పు లద్దాఖ్​, వాస్తవాధీన రేఖ సమీపంలోని ప్రాంతాల్లో పర్యటించారు సైనికాధ్యక్షుడు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, సైనిక సన్నద్ధత, సరిహద్దు వెంట భారత బలాన్ని పెంచే అంశాలపై రాజ్​నాథ్​కు నివేదించినట్లు తెలుస్తోంది.

లేహ్​లో యుద్ధ విమానాలు..

జూన్ 15,16 తేదిల్లో జరిగిన సరిహద్దు ఘర్షణల అనంతరం వాస్తవాధీన రేఖ వెంట అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది భారత్. క్రమంగా బలగాల సంఖ్యను పెంచుతోంది.

భారత వాయుసేన విమానాలు ఇప్పటికే లేహ్ ప్రాంతానికి చేరాయి. గగనతలంలో చక్కర్లు కొడుతూ గస్తీ నిర్వహిస్తున్నాయి.

నేపాల్ సరిహద్దుకు అదనపు బలగాలు..

పొరుగుదేశం నేపాల్.. కొద్దిరోజులుగా సరిహద్దులో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్​- నేపాల్ సరిహద్దుకు అదనపు బలగాలను తరలించింది సైన్యం. ఉత్తరాఖండ్ పితోర్​గఢ్ జిల్లా దర్చులా నుంచి కాలాపానీ వరకు సశస్త్ర సీమాబల్​కు చెందిన జవాన్లను మోహరించింది. నేపాల్​తో సరిహద్దును మూసేసింది.

భారత భూభాగాలను తమవిగా చూపుతూ కొత్త చిత్రపటాన్ని విడుదల చేయడం.. దర్చులాకు సమీపంలో రహదారి నిర్మాణం, భారత భూభాగమైన మాల్పాలో హెలీప్యాడ్ ఏర్పాటు వంటి చర్యలతో భారత్​- నేపాల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి:శనివారం నుంచి దిల్లీలో సెరోలాజికల్ సర్వే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details