తెలంగాణ

telangana

By

Published : Sep 27, 2019, 2:17 AM IST

Updated : Oct 2, 2019, 4:23 AM IST

ETV Bharat / bharat

పాక్​ డ్రోన్లపై అప్రమత్తం- ఎల్​ఓసీ వెంబడి హైఅలర్ట్​

అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి రెడ్​​ అలర్ట్​ ప్రకటించింది భారత సైన్యం. నిత్యం అప్రమత్తంగా ఉండాలని సైనికులకు ఆదేశాలందాయి. పాక్​ డ్రోన్ల ఘటనను తీవ్రంగా పరిగణించిన సైన్యం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

పాక్​ డ్రోన్లపై అప్రమత్తం- ఎల్​ఓసీ వెంబడి హైఅలర్ట్​

పాక్​ డ్రోన్లపై అప్రమత్తం- ఎల్​ఓసీ వెంబడి హైఅలర్ట్​

చైనా డ్రోన్లను వినియోగించి పంజాబ్​లోపాకిస్థాన్​ ఆయుధాలను జారవిడిచిన ఘటనను భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) తీవ్రంగా పరిగణించాయి. ఈ నేపథ్యంలో భారత్​- పాక్​ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి రెడ్​ అలర్ట్​ ప్రకటించాయి​. నిత్యం అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను ఆదేశించాయి.

పాకిస్థాన్​కు చెందిన డ్రోన్లు(10కేజీల సామాగ్రి మోయగలిగే సామర్థ్యం) పంజాబ్​లోని తర్న్​ తరన్​ జిల్లాలో 7-8 సార్లు వచ్చి ఆయుధాలు, నకిలీ నోట్లను జారవిడిచాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

అంతర్జాతీయ సరిహద్దు, జమ్ము, సాంబ, కథువా, రాజౌరీ, పూంచ్​, బారాముల్లా, కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సాధ్యమైనంత ఎక్కువ నిఘాను ఏర్పాటు చేయాలని దళాలకు సైన్యం, బీఎస్​ఎఫ్​ తెలిపాయి.

" ఇది దేశంలో ఉగ్ర చర్యలు చేపట్టడం కోసం ఆయుధాలు, పేలుడు సామాగ్రిని అక్రమంగా తరలించడానికి పాక్​ పన్నిన కుట్ర. భద్రతను కట్టుదిట్టం చేశాం. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిఘా పెంచాలని దళాలకు ఆదేశాలు జారీ చేశాం."
-- బీఎస్​ఎఫ్ అధికారి. ​

పాకిస్థాన్​తో భారత్​ పంచుకునే అంతర్జాతీయ సరిహద్దులో సుమారు 180 కిలోమీటర్లలో బీఎస్​ఎఫ్​ దళాలు గస్తీ కాస్తాయి. భారత గగనతలంలోకి అక్రమంగా చొరబడే ఎలాంటి డ్రోన్లనైనా నేలమట్టం చేయాలని భద్రతా దళాలకు ఆదేశాలు అందాయి.

Last Updated : Oct 2, 2019, 4:23 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details