తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెప్టెంబర్​ 3న వాయుసేనకు 'అపాచీ హెలికాప్టర్లు'

భారత వాయుసేనలోకి 4 అత్యాధునిక హెలికాప్టర్లు చేరనున్నాయి. సెప్టెంబర్​ 3న  పంజాబ్​ పఠాన్​కోట్​లో 'అపాచీ ఏహెచ్​-64ఈ' ఛాపర్లను వాయుసేనలో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.

By

Published : Aug 31, 2019, 5:12 AM IST

Updated : Sep 28, 2019, 10:45 PM IST

సెప్టెంబర్​ 3న వాయుసేనకు 'అపాచీ హెలికాప్టర్లు'

ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్లు 'అపాచీ ఏహెచ్-64ఈ' భారత వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది జులై 27న తొలి నాలుగు హెలికాప్టర్లను భారత్​కు అందించింది అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థ. వీటిని సెప్టెంబర్​ 3న పంజాబ్​ పఠాన్​కోట్​లోని భారత వైమానిక దళానికి అందించనున్నారు.

ఈ సందర్భంగా పఠాన్​కోట్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది వాయుసేన. ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీఎస్​ ధనోవా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
నాలుగేళ్ల తర్వాత..

22 అపాచీ ఛాపర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబర్​లో అగ్రరాజ్యంతో భారత వాయుసేన బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో మరో 6 హెలికాప్టర్లతో పాటు ఆయుధ సామగ్రి కొనుగోలుకు రూ.4,168 కోట్ల ఒప్పందం చేసుకుంది రక్షణ శాఖ.

2020 నాటికి మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లను భారత్​ అమ్ములపొదిలో ఉంటాయి. 2018 జులైలోనే ఈ హెలికాప్టర్ల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది భారత్​. వీటిని నడిపేందుకు వాయుసేన బృందం అమెరికాలో శిక్షణ తీసుకుంటోంది.

ఇదీ చూడండి: జీడీపీ క్షీణతకు మోదీనే కారణం: కాంగ్రెస్​

Last Updated : Sep 28, 2019, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details