తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'18 కోట్లమందిలో యాంటీబాడీలు అభివృద్ధి​' - ICMR latest update

భారత్​లో 18కోట్ల మందిలో కరోనావైరస్​తో పోరాడే యాంటీబాడీలు అభివృద్ధి అయినట్లు థైరోకేర్​ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది.

Antibody developed in 18 million people in India: Thyrocare
18 కోట్లమందిలో యాంటీబాడీలు అభివృద్ధి: థైరోకేర్​

By

Published : Jul 21, 2020, 10:25 PM IST

దేశంలోని దాదాపు 18 కోట్ల మందిలో ఇప్పటికే కరోనావైరస్‌కు వ్యతిరేంగా యాంటీబాడీలు అభివృద్ధి అయినట్లు థైరోకేర్‌ సంస్థ తెలిపింది. భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ధ్రువీకరించిన టెస్టింగ్‌ సంస్థల్లో ఒకటైన థైరోకేర్‌.. యాంటీబాడీలపై ఓ నివేదికను వెల్లడించింది.

దేశంలోని 600 పిన్‌కోడ్‌ ప్రాంతాల నుంచి 60 వేల యాంటీబాడీల టెస్టుల డేటాను పరిశీలించినట్లు థైరోకేర్‌ పేర్కొంది. దీని ద్వారా దేశంలో దాదాపు 15 శాతం ప్రజల్లో ఇప్పటికే ప్రతినిరోధకాలు అభివృద్ధి అయినట్లు తెలుస్తోందని వివరించింది. థైరోకేర్‌ సెంటర్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్ వెలుమణి కూడా ఈ సమాచారాన్ని తన ట్విట్టర్‌లో పొందుపరిచారు.

ఇదీ చూడండి:చతుర్భుజి కూటమి నావికాదళం భారత్​కు బలమేనా?

ABOUT THE AUTHOR

...view details