ఉత్తర్ ప్రదేశ్లో విజృంభించిన హత్యాచారాల నీచపు పర్వంలో మరో బాలిక బలైంది. సరిగ్గా 22 రోజుల క్రితం.. హాథ్రస్ దళిత యవతిపై అఘాయిత్యం జరిగిన రోజే.. అదే గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి అలీఘఢ్లో ఓ కామాంధుడి చేతిలో చిత్రవధ అనుభవించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. దీంతో హాథ్రస్వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
హాథ్రస్కు చెందిన బాలిక తల్లి ఈ ఏడాది జవరిలో మృతి చెందింది. దీంతో, అలీఘఢ్లోని ఓ బంధువు ఇంట్లో ఆశ్రయం పొందింది ఆ చిన్నారి. చేరదీసిన బంధువు కుమారుడు సెప్టెంబర్ 14న అభం శుభం తెలియని ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారికి అలీఘఢ్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స అందించారు. దాదాపు ఇరవై రోజులకు పైగా ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస విడిచింది ఆ బాలిక.
నిందితుడిని అరెస్ట్ చేయకుండా...