తెలంగాణ

telangana

By

Published : Jun 27, 2019, 11:26 AM IST

Updated : Jun 27, 2019, 12:37 PM IST

ETV Bharat / bharat

పైలట్​ చాకచక్యంతో తప్పిన 'పక్షి రాజు' ముప్పు

వైమానిక దళానికి చెందిన జాగ్వర్​ యుద్ధ విమానానికి పక్షి తగిలి ఓ ఇంజిన్​ విఫలమైంది. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్​ హరియాణాలోని అంబాలా ఎయిర్​ బేస్​లో సురక్షితంగా ల్యాండ్​ చేశారు.

పైలట్​ చాకచక్యంతో తప్పిన ముప్పు

పైలట్​ చాకచక్యంతో తప్పిన 'పక్షి రాజు' ముప్పు

హరియాణాలో ఘోర ప్రమాదం తప్పింది. గాల్లోకి ఎగిరిన యుద్ధ విమానాన్ని పక్షి ఢీ కొని ఓ ఇంజిన్​ పనిచేయకుండా పోయింది. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్​ విమానాన్ని సురక్షితంగా కిందకు దింపాడు.

భారత వైమానిక దళానికి చెందిన 'జాగ్వర్'​ యుద్ధ విమానానికి ఆకాశంలో పక్షి తగిలి ఇంజిన్​ విఫలమైంది. వెంటనే తన చాకచక్యంతో అందులోని ఇంధన ట్యాంకును ఖాళీ చేశారు పైలట్​. చిన్న చిన్న బాంబులు, సామగ్రిని కిందకు వదిలేసి విమానాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశారు. ఇంజిన్​ విఫలమైనప్పటికీ అంబాలా ఎయిర్​ బేస్​లో సురక్షితంగా కిందకు దింపారు. ఘటన స్థలానికి చేరిన అధికారులు పైలట్​ను ఆసుపత్రికి తరలించారు. ఎయిర్​ బేస్​ సమీపంలో విమానం నుంచి పడిన చిన్న బాంబులను గుర్తించారు.

ఆకాశం నుంచి చిన్న చిన్న బాంబులు కిందపడడాన్ని చూసి ఎయిర్​ బేస్​ సమీపంలోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

ఇదీ చూడండి: బాలాకోట్​ దాడుల వ్యూహకర్తకు 'రా' బాధ్యతలు

Last Updated : Jun 27, 2019, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details