తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొలిసారి ఎక్స్​ప్రెస్ రైలును నడిపి మహిళ ఘనత - a lady loco pilot .

మహిళా దినోత్సవానికి ముందే భారతీయ రైల్వే ముందడుగు వేసింది. తొలిసారిగా ఎక్స్​ప్రెస్​ రైలు లోకో పైలెట్​గా మహిళను నియమించింది. బెంగళూరు- మైసూరు రాజ్యరాణి ఎక్స్​ప్రెస్​ను శివపార్వతి నడిపినట్లు అధికారులు వెల్లడించారు.

An Express rail is driven by a lady loco pilot for the first time
తొలిసారి బెంగళూరు- మైసూర్​ ఎక్స్​ప్రెస్​ నడిపిన మహిళ

By

Published : Mar 3, 2020, 11:36 AM IST

Updated : Mar 3, 2020, 12:22 PM IST

తొలిసారి ఎక్స్​ప్రెస్ రైలును నడిపిన మహిళ

మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహణకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతుంటే అంతకుముందే అతివల విషయంలో భారతీయ రైల్వే మరో ముందడుగు వేసింది. మహిళా సాధికారతకు ప్రోత్సాహమిచ్చే చర్యల్లో భాగంగా తొలిసారి ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలెట్‌గా మహిళను నియమించింది.

బెంగళూరు-మైసూరు రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలును బాలా శివపార్వతి అనే లోకోపైలెట్ నడపగా, రంగోలి పటేల్ అనే మరో మహిళ సహాయ లోకో పైలెట్‌గా విధులు నిర్వహించారు. మహిళా దినోత్సవం రోజున కూడా రాజ్యరాణి రైలును వీరిరువురూ నడుపుతారని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:శాంతి ఒప్పందంలో ఘనీ చర్యలు బేష్​: ట్రంప్​

Last Updated : Mar 3, 2020, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details