సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరులో గురువారం నిర్వహించిన సభలో అమూల్య లియోన్ అనే యువతి పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా సభ నిర్వహించగా మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ సభకు హాజరై ప్రసంగించారు. అయితే ఓవైసీ ప్రసంగం తర్వాత 19 ఏళ్ల అమూల్య లియోన్ ఒక్కసారిగా వేదికపైకి చేరుకొని పాక్కు అనుకూలంగా నినాదాలు చేసింది. షాక్కు గురైన ఓవైసీ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి మైక్ను లాక్కొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ యువతి వెనక్కి తగ్గకపోవడం వల్ల పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అమూల్యకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది
ఓవైసీ వివరణ
ఆ యువతితో తనకు గానీ, తన పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని ఓవైసీ వివరణ ఇచ్చారు. ఆమెను ఈ సభకు ఆహ్వానించలేదని నిర్వాహకులు కూడా స్పష్టం చేశారు. తమ సభను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రగా దీన్ని అభివర్ణించారు. ఈ అంశంపై భాజపా, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలకు దిగాయి.
జైల్లో పెట్టినా తప్పులేదు