తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియాంక దుర్యోధనుడి కథకు 'అర్జునుడి' కౌంటర్ - ప్రియాంక

దుర్యోధనుడ్ని ప్రస్తావిస్తూ మోదీపై ప్రియాంక గాంధీ చేసిన విమర్శలకు బదులిచ్చారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. దుర్యోధనుడు ఎవరో.. అర్జునుడు ఎవరో మే 23న తేలుతుందన్నారు.

అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు

By

Published : May 7, 2019, 5:24 PM IST

Updated : May 7, 2019, 6:16 PM IST

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించడాన్ని సమర్థించారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. ఈ అంశంపై కాంగ్రెస్​ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగాల్​ విష్ణుపుర్​ బహిరంగ సభలో ప్రసంగించారు అమిత్​ షా. మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన విమర్శలకూ గట్టిగా బదులిచ్చారు.

ప్రియాంక దుర్యోధనుడి కథకు 'అర్జునుడి' కౌంటర్

"హరియాణాలోని అంబాలాలో మోదీని ప్రియాంక గాంధీ దుర్యోధనుడు అన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో మీరంటే దుర్యోధనులు అయిపోరు. మే 23న తేలుతుంది దుర్యోధనుడు ఎవరో.. అర్జునుడు ఎవరో?

రాజ్​బబ్బర్ మోదీ తల్లి గురించి తప్పుగా మాట్లాడతారు​. రాహుల్​ గాంధీది అదే తీరు. మోదీ ఉగ్రవాది అని సంజయ్​ నిరుపమ్ అంటారు. ఒసామా బిన్​ లాడెన్​తో పోలుస్తారు పవన్​ కేడా​. విజయ శాంతి అలాగే మాట్లాడతారు. కాకుల్లా అరిస్తే భాజపా భయపడుతుందని అనుకుంటున్నారు వాళ్లు.

రాజీవ్​ గాంధీ హయాంలో బోఫోర్స్​ కుంభకోణం జరిగింది. ఆయన పాలనలో చాలా అవినీతి జరిగింది. అప్పుడే శాంతి, సంఝౌత పేరుతో శ్రీలంకలో మన సైనికులు చనిపోయారు. ఇవన్నీ రాజీవ్​ సమయంలోనే జరిగాయా లేదా? ఇది చెబితే వాళ్లకు నచ్చదు. దేశ మాజీ ప్రధానిని అవమానిస్తారా? అని అడుగుతున్నారు.

మరి మీరేం చేశారు? ప్రధాని మోదీని 51సార్లు అవమానించారు. ప్రపంచంలో ప్రజాకర్షక ప్రధానిని అవమానించారు. ఇది మీకు కనిపించడం లేదా?"

-అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చూడండి: టార్గెట్​ మోదీ: ప్రియాంక నోట దుర్యోధనుడి కథ

Last Updated : May 7, 2019, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details