తెలంగాణ

telangana

'మహా' ప్రతిష్టంభన: పవార్​ ఇంటికి శివసేన నేత

By

Published : Oct 31, 2019, 11:02 PM IST

Updated : Nov 1, 2019, 7:46 AM IST

శివసేన సీనియర్​ నేత, ఎంపీ సంజయ్​ రౌత్​... ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​పవార్​ నివాసానికి వెళ్లారు. మహారాష్ట్రలో నెలకొన్న తాజా రాజకీయాలపై చర్చించారు. దీనితో రాష్ట్రంలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పడే అవకాశముందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.

'మహా' ప్రతిష్టంభన: పవార్​ ఇంటికి శివసేన నేత

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులు గడిచినా.. ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రి పీఠంపై భాజపా- శివసేన మధ్య నెలకొన్న ప్రతిష్టంభనే ఇందుకు కారణం. అయితే ఉద్దవ్​ ఠాక్రే నేతృత్వంలోని శివసేన తన వైఖరితో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. 50-50 ఫార్ములా అమలు చేస్తేనే భాజపాకు మద్దతిస్తామని తేల్చి చెబుతున్న శివసేన నేతలు..గురువారం సాయంత్రం గవర్నర్​ను కలిశారు. ఎన్నికల్లో తొలిసారి పోటీపడి ఘన విజయం సాధించిన ఆదిత్య ఠాక్రే సహా అనేక మంది సీనియర్​ నేతలు రాజ్​భవన్​కు తరలివెళ్లారు. ఇది జరిగిన కొద్ది సేపటికే నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్​సీపీ) అధ్యక్షుడు​ శరద్ ​పవార్​తో భేటీ అయ్యారు.. శివసేన ముఖ్య నేత, ఎంపీ సంజయ్​ రౌత్​. ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలో భాజపాయేతర ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

దక్షిణ ముంబయిలోని పవార్​ నివాసానికి వెళ్లిన రౌత్​.. ఎన్​సీపీ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. వీరి మధ్య జరిగిన చర్చలపై తొలుత ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల రాష్ట్రంలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయన్న వార్తలు పెరిగాయి.

శరద్​ పవార్​కు దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లినట్టు రాజ్యసభ ఎంపీ తెలిపారు. దానితో పాటు మహారాష్ట్రలోని తాజా రాజకీయాలపై చర్చించినట్టు స్పష్టం చేశారు సంజయ్​ రౌత్​.

Last Updated : Nov 1, 2019, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details