దిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు ఓ రెండేళ్ల బాలుడు. లక్షణాలు లేని కరోనా వైరస్ బాధితులకు పరీక్షలు నిర్వహించకూడదన్న ప్రభుత్వ నిర్ణయంతో తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని పిటిషన్లో పేర్కొన్నాడు.
"పిటిషనర్.. ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన మైనర్. కుటుంబంలో చాలా మంది పని చేస్తున్నారు. దిల్లీ ప్రభుత్వం ప్రకటించిన 'అన్లాక్డౌన్'తో ఉద్యోగాల కోసం ఆఫీసులకు వెళుతున్నారు. కుటుంబసభ్యులతో జీవిస్తున్న ఇతర మైనర్లలాగే.. ఈ రెండేళ్ల బాలుడికి కూడా వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉంది. ఆంక్షలు ఎత్తివేయడం సహా లక్షణాలు లేని వారికి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పరిస్థితులు దారుణంగా మారాయి. ఆరోగ్య వసతులు, వెంటిలేటర్లు, ఆసుపత్రుల్లో పడకలు కూడా తక్కువగా ఉన్నాయి."
-- పిటిషనర్ తండ్రి.