తెలంగాణ

telangana

By

Published : Jan 30, 2020, 10:37 PM IST

Updated : Feb 28, 2020, 2:18 PM IST

ETV Bharat / bharat

వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా

దిల్లీలో లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలపై చర్చించారు. ఈ భేటీకి ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని నేతలు తనకు హామీ ఇచ్చినట్టు బిర్లా తెలిపారు.

All parties have assured me of cooperation in running Lok Sabha smoothly: Speaker Om Birla
వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా

శుక్రవారం నుంచి జరగనున్న పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఫలప్రదంగా ఉండనున్నాయని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా తెలిపారు. సభలు సజావుగా సాగేందుకు సహకరించనున్నట్టు అన్ని పార్టీల నేతలు తనకు హామీనిచ్చినట్టు పేర్కొన్నారు బిర్లా. సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా

"సభలు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతాయని అన్ని పార్టీల నేతలు నాకు హామీనిచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలని నేను కూడా వారిని అభ్యర్థించా. ఈసారి జరిగే సమావేశాలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటాయని నేను విశ్వసిస్తున్నా."
--- ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్​.

ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.ఈ సారి బడ్జెట్​ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత... మార్చి 2 నుంచి ఏప్రిల్​ 3 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.

Last Updated : Feb 28, 2020, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details